Tirumala: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హీరోయిన్ త్రిష ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఆమె తిరుమలకు రావాల్సిన పరిస్థితి కారణమేంటి? ఏమైనా స్పెషల్ ఉందా? లేకుంటే విజయ్ పార్టీ గెలవాలని స్వామిని మొక్కుకున్నారా? ఇవే ప్రశ్నలు చాలామంది అభిమానులను వెంటాడుతున్నాయి.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో నటి త్రిష
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ నటి త్రిష వ్యవహారం మరోసారి కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే మే నాలుగున నటి త్రిష పుట్టినరోజు కావడంతో గతరాత్రి ఆమె తిరుమలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు.
ఇక టీవీకె పార్టీ విజయ్తో త్రిషకు మంచి రిలేషన్ షిప్ ఉందని అంటున్నారు. టీవీకె పార్టీ వెనుక అన్ని వ్యవహారాలను ఆమె చూసుకుంటున్నారని గత ఎన్నికల ప్రచారంలో గుసగుసలు లేకపోలేదు. ఈ క్రమంలో తన పుట్టినరోజు, ఫలితాలు వెల్లడి ఒకేసారి రావడంతో తిరుమలకు వచ్చారని టీవీకె మద్దతుదారుల మాట.
తిరుమల వెంకన్నస్వామి ఆశీస్సులు తీసుకున్న త్రిష
ఒకవేళ టీవీకె పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా అన్నాడీఎంకె పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చని అంటున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. దీని వెనుక నటి త్రిష ఉన్నారనే అంటున్నారు. మొత్తానికి తమిళనాట ఎన్నికల ఫలితాల విషయంలో త్రిష వ్యవహారంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో ఆమె గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: ‘వారణాసి’ మూవీకి వేసవి సెగ..? జక్కన్నకు కోలుకోలేని షాక్..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి త్రిష pic.twitter.com/LCLxAOEpq2
— ChotaNews App (@ChotaNewsApp) May 4, 2026