Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తమ్ముడి జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆయన భార్య విషిత (హిమబిందు) ప్రస్తుత పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఉదయ్ కిరణ్ మరణించే సమయానికి విషిత వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమేనని, అంత చిన్న వయసులోనే ఆమె ఒక పెద్ద జీవిత సత్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె ఎంతో గౌరవప్రదంగా, ధైర్యంగా తన జీవితాన్ని కొనసాగిస్తోందని, ఆమె పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని శ్రీదేవి పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె చేసిన త్యాగం మరువలేనిదని చెప్పుకొచ్చారు.
Read also-Regina Cassandra: బాలీవుడ్పై రెజీనా కాసాండ్రా సంచలన వ్యాఖ్యలు.. మరీ ఇంత చిన్నచూపా?
ప్రస్తుతం విషిత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి, ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో (Meta/Facebook వంటి సంస్థల్లో) ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయ్ కిరణ్ మరణానంతరం ఆమె మరో వివాహం చేసుకోకుండా, తన వృత్తిపరమైన ఎదుగుదలపైనే దృష్టి సారించారు. మీడియాకు మరియు వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటూ, అత్యంత సామాన్యమైన మరియు ప్రైవేట్ జీవితాన్ని గడపడానికే ఆమె మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ, ఉదయ్ కిరణ్ కుటుంబంతో ఆమెకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమైంది.
Read also-Horror Comedy OTT : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే
ఉదయ్ కిరణ్ వ్యక్తిత్వం గురించి చెబుతూ, ఆయన బయట కనిపించే స్టార్డమ్ కంటే ఇంట్లో చాలా సాదాసీదాగా ఉండేవాడని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. షూటింగ్ ఒత్తిడి లేదా ఇతర సమస్యలను ఎప్పుడూ కుటుంబ సభ్యులకు తెలియనిచ్చేవారు కాదని, అందరినీ నవ్వుతూ ఉంచడానికే ప్రయత్నించేవారని తెలిపారు. ఉదయ్ కిరణ్ భౌతికంగా దూరమైనా, ఆయన భార్య విషిత ఆయన జ్ఞాపకార్థం కొన్ని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, తనదైన శైలిలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.