E-Paper
Advertisement

Tollywood Movies : ఉగాది వరకు థియేటర్లు ఖాళీ.. ఈ వారం నో సినిమా..!

Tollywood Movies : ఉగాది వరకు థియేటర్లు ఖాళీ.. ఈ వారం నో సినిమా..!
Advertisement

Tollywood Movies : ప్రతి పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఇక్కడ సినిమాల సంగతి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఈ పండగకి పోటీ పడతాయి. ఆ తర్వాత వాలెంటెన్స్ డే సందర్భంగా సినిమాలు కొన్ని రిలీజ్ అవుతాయి. ఇక సమ్మర్ అంటే కచ్చితంగా ఉగాదికి బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంటాయి.. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి రెండవ వారం పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలుసు.. దాని కారణంగా గతవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఈవారం థియేటర్లలో సినిమాలు పెద్దగా రిలీజ్ అవడం లేదని తెలుస్తుంది.. ఉగాది పండగ వరకు థియేటర్లు ఖాళీగానే ఉండబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఉగాదికి ఎలాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మార్చిలో రిలీజ్ అయిన సినిమాలు.. 

ప్రతి శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా పసలేకుండానే నిరాశను మిగిల్చాయి.. మార్చి తొలివారంలో ‘మృత్యుంజయ్’తో పాటు మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. కానీ, ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ టాక్ని అందుకు లేకపోయాయి. దాంతో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలకు జనాలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.. మార్చ్ మూడోవారము నాలుగో వారం సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు ఉగాదికి రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..

Advertisement

Also Read :రవి పై ప్రభావతి సీరియస్.. బాలు పాలల్లో నిద్ర మాత్రలు కలిపిన రోహిణి..దొరికిపోతుందా..?

ఉగాదికి రిలీజ్ కాబోతున్న సినిమాలు..

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. కానీ ఈ శుక్రవారం మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలైతే రిలీజ్ కావడం లేదని తెలుస్తుంది. ఇక ఉగాదికి మాత్రం థియేటర్లు ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉగాదికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ఉగాది పర్వదినం కానుకగా మార్చి 19న రెండు బడా సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సీక్వెల్ మూవీ దురంధర్ 2 రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమా గత వారంలోని రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. ఈ రెండు సినిమాలు ఈ ఉగాదికి పోటీ పడిపోతున్నాయి. ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×