E-Paper
Advertisement

Drug Racket: 2 వేల కోట్ల డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. తమిళ నిర్మాతే మాస్టర్‌మైండ్..

Drug Racket: 2 వేల కోట్ల డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. తమిళ నిర్మాతే మాస్టర్‌మైండ్..
Advertisement
Tamil Film Producer Mastermind In Drug Racket
Tamil Film Producer Mastermind In Drug Racket

Tamil Film Producer Mastermind In Drug Racket:  దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో సూడోపెడ్రిన్ ను కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందింది. దీనిని హెల్త్‌ మిక్స్‌ పౌడర్స్‌, కొబ్బరి సంబంధిత ఆహారంలో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ డ్రగ్‌ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ అధికారులు నిఘా పెట్టారు.

Advertisement

ఈ నేపథ్యంలో సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు ఎన్‌సీబీ విచారణలో తేలింది.

ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిను ఎగుమతి చేశారని.. దాని విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ఎన్‌సీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×