E-Paper
Advertisement

Akhilesh Yadav: రాహుల్‌‌తో అఖిలేష్‌ యాదవ్‌.. న్యాయ యాత్రలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్..

Akhilesh Yadav:  రాహుల్‌‌తో అఖిలేష్‌ యాదవ్‌.. న్యాయ యాత్రలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్..

Akhilesh Yadav participated in Nyaya Yatra

Akhilesh Yadav participated in Nyaya Yatra: లోక్‌సభ ఎన్నికలలో సీట్ల వాటా ఒప్పందం ముగిసిన తరువాత సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయ్‌ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ పాల్గొన్నారు.

ఆదివారం తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అలీగఢ్‌లో యాత్రలో పాల్గొన్నారు. అలీఘర్ డివిజన్ నుంచి అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్ మీదుగా యాత్ర సాగి ఆగ్రా డివిజన్‌లోకి ప్రవేశించింది. ఆగ్రా డివిజన్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ చేరారు. రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ ప్రసంగం నిర్వహించారు.

Read More:  మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే అతిపెద్ద సవాలు అని అన్నారు. బీజేపీ నాశనం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను నెరవేర్చడం మా బాధ్యత అన్నారు. ‘బీజేపీ హాటావో, దేశ్ బచావో’ అని నినదించారు.

10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. జీ20 సమ్మిట్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగాయి. ఇలాంటి ఘటనల వల్ల దేశ గౌరవం పెరుగుతోందని అందరూ అన్నారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. కానీ.. దేశంలో యువత నిరుద్యోగం, రైతు నిరసనలు, ద్రవ్యోల్బణంపై రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వంలో పేదలు భారతదేశంలో నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను ఎస్‌పీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్‌పీ ఐదు సీట్లు గెలుచుకుంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×