BigTV English

A boat capsized: జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు మృతి

A boat capsized: జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు మృతి

A boat capsized: జమ్మూకాశ్మీర్‌లో ఘోరం ప్రమాదం జరిగింది. శ్రీనగర్ సమీపంలోని ఉన్న జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మిస్సయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Also Read : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మంగళవారం ఉదయం 10 నుంచి 12 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి బోటు బయలుదేరింది. మార్గ మధ్యలోకి వెళ్లేసరికి వాటర్ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బోటు తిరగబడిపోయింది. నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పలువురు జాడ కనిపించలేదు. వారి కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఎస్‌డీ‌ఆర్‌ఎఫ్ టీమ్. అయితే మృతి చెందినవారెవరు? అనేది తెలియాల్సి ఉంది.


కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్‌లో హిమపాతానికి తోడు భారీవర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ స్థానిక ప్రజలను అలర్ట్ చేసింది. ఇళ్లలో నుంచి ఎవరు బయటకురావద్దని హెచ్చరించింది. అయితే వర్షం తగ్గడంతో విద్యార్థులు పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

 

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×