E-Paper
Advertisement

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్
Advertisement
Telugu breaking news

Manipur news today(Telugu breaking news):

భారత్ – మయన్మార్ సరిహద్దులో.. దక్షిణ మణిపుర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన సైనికుడొకరు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.

గతేడాది మణిపుర్ లో రెండు జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా.. ఎంతటి ఆందోళనలకు దారితీశాయో తెలిసిందే. మణిపుర్ అల్లర్లతో యావత్ దేశం అట్టుడికింది. తాజాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైన చురాచాంద్ పుర్ కావడం గమనార్హం. అతను కుకీ వర్గానికి చెందినవాడిగా గుర్తించారు.

Advertisement

కాల్పులకు గురైన బాధితులు మైతేయ్ వర్గానికి కానీ.. మణిపుర్ కు చెందినవారు కానీ కాదని సమాచారం. ఈ కాల్పులపై ఎలాంటి వదంతులు లేకుండా ఉండేందుకు అస్సాం రైఫిల్స్ ఈ ఘటన వివరాలను వెల్లడించింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×