E-Paper
Advertisement

Ayodhya Devotees : అయోధ్యకు తగ్గని భక్తుల తాకిడి.. 75 లక్షల మందికి రామ్ లల్లా దర్శనం

Ayodhya Devotees : అయోధ్యకు తగ్గని భక్తుల తాకిడి.. 75 లక్షల మందికి రామ్ లల్లా దర్శనం
Advertisement

ayodhya ram mandir latest news

Ayodhya Ram Mandir Devotees(Telugu news live today) : ఈ ఏడాది జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ట జరుపుకున్న రామ్ లల్లా ను దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి రెండు నెలలు పూర్తయినా.. ఇప్పటికీ భక్తుల తాకిడి అదే స్థాయిలో ఉంది. నాటి నుంచి నేటి వరకూ సుమారు 75 లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని దర్శించుకున్నట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామమందిరం పూర్తి నిర్మాణం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని తెలిపింది. ఆలయ సముదాయ నిర్మాణ పనుల్లో 1500 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారని, త్వరలోనే 3500 మందిని నియమించనున్నామని ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నెలలోనే పూర్తయింది. ఇప్పుడు ఆలయ ప్రధాన గోపురం, ఇతర గోపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 300 రోజుల్లో ప్రధాన గోపురం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆలయ సముదాయంలో మొత్తం 5 శిఖరాలు ఉండగా.. 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేయిస్తామని అనిల్ మిశ్రా పేర్కొన్నారు.

ఇక ఆలయ ప్రహరీ వెంబడి ఆరుగురు దేవతామూర్తుల ఆలయాలు, వాటి పక్కనే సప్తరిషిల ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్యమునులతో పాటు నిషిద్ధరాజ్, అహల్య వంటి మహారుషులు, పురాణ పురుషుల ఆలయాలను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.

Advertisement

కాగా.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ భక్తులకు రామ్ లల్లా దర్శనాన్ని కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ దర్శనం ఆపి, ఆలయాన్ని మూసివేస్తారు. ఉదయం 4 గంటల నుంచి 2 గంటల పేరు రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×