E-Paper
Advertisement

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం
Advertisement

150 Years of Vande Mataram: భారత స్వాతంత్య్ర పోరాటంలో అజరామర స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు (నవంబర్ 7) దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ 150వ వార్షికోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే ప్రధాన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండగా, రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వందేమాతరం 150వ వార్షికోత్సవం (ఉత్సవం) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలలో “వందేమాతరం” పూర్తి గీతాన్ని సామూహికంగా (మాస్ సింగింగ్) ఆలపించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పకడ్బందీగా నిర్వహించాలని సూచించింది.

Advertisement

ఢిల్లీలో స్మారక స్టాంపు, నాణెం: ప్రధాని మోదీ

ఈ చారిత్రక రోజుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. “నవంబర్ 7 ప్రతి భారతీయుడికి ఒక చిరస్మరణీయమైన రోజు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన, దేశభక్తిని రగిలించిన వందేమాతరం 150 ఏళ్లను జరుపుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఉదయం 9:30 గంటలకు జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధాని వెల్లడించారు. ఈ వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల స్మారకార్థం ప్రత్యేక స్టాంపు, నాణెం కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సామూహిక వందేమాతరం గానం హైలైట్‌గా నిలుస్తుందని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Read Also: Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×