E-Paper
Advertisement

Delhi News: ఫుల్లుగా తాగి ఆపై ర్యాపిడోలో యువతి.. రైడర్‌కు నరకం, చివరకు ఢిల్లీలో ఏం జరిగింది?

Delhi News: ఫుల్లుగా తాగి ఆపై ర్యాపిడోలో యువతి..  రైడర్‌కు నరకం, చివరకు ఢిల్లీలో ఏం జరిగింది?
Advertisement

Delhi News: దేనికైనా సమయం.. సందర్భం అనేది ఉంటుంది. అదిశృతి మించితే లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అఫ్ కోర్సు అందుకు కారణాలు అనేకం. ఫుల్లుగా తాగి ర్యాపిడో ఎక్కింది ఓ యువతి. బైక్ పై కూర్చోలేక కిందకు జారింది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

ఫుల్లుగా తాగి ర్యాపిడో ఎక్కిన  యువతి

Advertisement

Advertisement

ఢిల్లీలోని నైట్ క్లబ్‌లో ఓ యువతి ఫుల్లుగా మద్యం సేవించింది. అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. మద్యం మత్తు ఎక్కువైంది. సరిగా బైక్‌పై కూర్చోలేక నానాఇబ్బందులు పడింది. వెళ్తున్న బైక్‌పై నుంచి రోడ్డుపైకి జారిపోతుండగా బైకర్ అప్రమత్తం అయ్యాడు. ఓ చేత్తో గట్టిగా పట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.

దీంతో ఆ యువతికి పెను ప్రమాదం తప్పింది. కాకపోతే ఆ యువతి ఆ మత్తు నుంచి బయటపడటానికి దాదాపుగా రెండు మూడు గంటలు పట్టింది. అయినాసరే రైడర్ ఆ యువతిని సరిగా కూర్చోవాలని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ మహిళ చివరకు బైక్ నుండి పూర్తిగా జారిపోయింది.

బైకర్‌కు నరకం, ఢిల్లీలో ఏం జరిగింది?

ఆ సమయంలో రైడర్‌కు నరకం కనిపించింది. రాత్రివేళ నాలుగైదు రైడ్స్ చేసి రూమ్‌కి వేగంగా వెళ్లిపోవాలని రైడర్ భావించాడు. చివరకు యువతి వల్ల తన టైమ్ వృథా అయ్యిందంటూ ఇబ్బందిపడ్డాడు. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

దీనిపై నెటిజన్స్ రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. వీడియో చిత్రీకరణ సందర్భంగా యువతిని కింద పడనివ్వండి అంటూ మాటలు వినిపించాయి. సోషల్ మీడియా చర్చ మొదలైంది. రాత్రివేళ మహిళల భద్రత ఇది కాదా? మిడ్ నైట్‌లో ఆ విధంగా చేయడం ఏంటి? కల్చర్ పేరుతో మహిళల్లో డ్రింక్ వ్యవహారం హద్దులు దాటుతోందని అంటున్నారు.

ALSO READ: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

స్పృహ లేని స్థితిలో జరిగే అవాంఛనీయ ఘటనలకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. యువతి వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. యువతి ఆ విధంగా కనిపించడానికి గల కారణాలపై చర్చించాలని అంటున్నారు కొందరు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×