Cuttack: ఒడిశాలోని కటక్ సిటీలో ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ అర్ధరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలేం జరిగింది?
ఒడిషాలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
ఒడిశాలోని కటక్ SCB మెడికల్ కాలేజీ-హాస్పిటల్లోని ట్రామా కేర్ ఐసీయూలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత చిన్నగా రేగిన మంటలు ఆ తర్వాత ఐసీయూని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది రోగులు మరణించారు.
మరో 11 మంది ఆసుపత్రి సిబ్బందికి కాలిన గాయాలు అయ్యాయి. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనలో ఐసీయూలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. మంటలు రావడం అలర్టయిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సంబంధించి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే 10 మంది ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు.
ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి
SCB ఆసుపత్రి ఒడిశాలో ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఒడిశా ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితి అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను సీఎంతోపాటు మంత్రులు పరామర్శించారు.
ఘటనలో వార్డులో దాదాపు 30 మందికి పైగానే పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 23 మంది రోగులను ఇతర విభాగాలకు తరలించారు. గాయపడిన రోగులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ ఆయన ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ALSO READ: కాన్షీ రామ్కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!
🚨
SCB ମେଡିକାଲ ଟ୍ରମା କେୟାର ଆଇସିୟୁ ରେ ବଡ଼ ଧରଣର ଅଗ୍ନିକାଣ୍ଡ। ଗୁରୁତର ରୋଗୀଙ୍କୁ ମେଡିକାଲ ର ଅନ୍ୟ ଆଇସିୟୁ କୁ ସ୍ଥାନାନ୍ତରିତ। ଅଗ୍ନିକାଣ୍ଡ ର କାରଣ ଅସ୍ପଷ୍ଟ।ଘଟଣା ସ୍ଥଳେ ସ୍ୱାସ୍ଥ୍ୟ ସଚିବ।ରାତି ପାଖାପାଖି 2.30 ବେଳକୁ ନିଆଁ ଲାଗିଥିବା ସୂଚନା।#SCBMedical #cuttack #Odisha pic.twitter.com/hhDm1MPqIJ
— sambit kumar 🇮🇳 (@SambitRout18) March 15, 2026