BigTV English
Advertisement

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి

A Mother Throws 6 Years Son Crocodile Infested River: దంపతుల మధ్య గొడవ, ఆరేళ్ల కొడుకుని మొసలికి ఇచ్చిన తల్లి

A Mother Throws 6 Years Son Crocodile Infested River: వాళ్లిద్దరు భార్యభర్తలు.. ఆ దంపతులను వారిని చూసి చుట్టుపక్కల వాళ్లు ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. తమకు అలాంటి అల్లుడు-కూతురు ఉంటే బాగుండేదని అనుకునేవారు. రోజులు గడిచాయి… ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. నాలుగేళ్లు వచ్చినా బాబుకి మాటలు రాకపోవడంతో డాక్టరు వద్దకు వెళ్లారు ఆ దంపతులు. ఆ డాక్టర్ అసలు విషయం చెప్పేశారు. పుట్టికతో బాబు మూగవాడని చెప్పడంతో పేరెంట్స్ షాకయ్యారు.


కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. క్షణికావేశంలో కన్న తల్లి ఆరేళ్ల కొడుకుని మొసళ్లు ఉండే నదిలోకి విసిరేసింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?  హలమాడి గ్రామానికి చెందిన 27 ఏళ్ల రవికుమార్- ఆమె భార్య సావిత్ర మధ్య చీటికి మాటికీ గొడవలు జరిగేవి. ఆ కోపం కాస్త కొడుకు వరకు వెళ్లేది. శనివారం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఎందుకన్నావ్ .. కొడుకుని పారేయ్ అని కట్టుకున్న భర్త కోపంతో చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మొసళ్లు ఉండే నదిలోకి కొడుకుని విసిరేసింది ఆ ఇల్లాలు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పడంతో బాలుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. చివరకు ఆదివారం బాలుడి మృత దేహాన్ని గుర్తించారు. బాలుడి చేయి మొసలి తినేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి కారణమైన పేరెంట్స్‌ని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. క్షణికావేశంలో చిన్నారిని పొట్టనపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. వీళ్లు మనుషులేనా అంటూ ఆ ఊళ్లో వాళ్లు ఆడిపోసుకుంటున్నారు.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×