E-Paper
Advertisement

DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు..

DIG Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు..
Advertisement

Anantapur DIG Ammireddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలోని పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఈసీ వేటును కొనసాగిస్తోంది. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేసింది.

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆయన్ను విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులను అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇటీవలే కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Advertisement

కాగా, ఇటీవలే అనంతపురం ఎస్సీ అన్బరాజన్ ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అనంతపురం ఎస్సీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈయన కూడా రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఈసీకి భారీ ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్బురాజన్ స్థానంలో అమిత్ బర్దర్ ను ఈసీ అనంతపురం ఎస్పీగా నియమించింది. వీరితో పాటుగా అనంతపురం అర్బన్ డీఎస్పీగా టివివి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును ఇప్పటికే ఎన్నికల సంఘం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బదిలీలు జరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరో వైపు కొత్త వారి నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×