E-Paper
Advertisement

Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?

Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?

Aadhaar News: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఇందుకు కారణాలు సైతం వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సమాచారం తీసుకుని దాని ఆధారంగా తొలగించింది.

రెండు కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు

ఆధార్ ఈ పేరు చెప్పగానే సామాన్యుడి భయపడతాడు. ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకం కావాలన్నా కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అంతేకాదు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా అదే పరిస్థితి. చివరకు విద్యార్థులు పాఠశాలలో చేరినప్పుడు కూడా ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అలాంటి ఏకంగా 2 కోట్ల మంది ఆధార్ కార్డులను తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయి.

ఆధార్ వ్యవస్థ వచ్చిన తొలినాళ్లలో చాలామంది రెండేసి ఆధార్ కార్డులను తీసుకున్నారు. అన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు లింకు చేయడంతో చాలావరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చాలామంది ఉపయోగిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.  అంతేకాదు వాటి నిధులు ట్రాన్స్‌ఫర్, సెల్‌ఫోన్ సిమ్‌లు తీసుకోవడం జరిగింది.

ఉడాయ్ సంచలన నిర్ణయం,  మరో విడత కూడా?

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా మరణించిన వ్యక్తుల డేటాను సేకరించింది. యాక్టివేట్ దాదాపుగా రెండు కోట్ల ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను తొలగించినట్లు ఉడాయి తెలిపింది.

తొలగించిన ఆధార్ నెంబర్‌ని మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబడదని తేల్చిచెప్పింది. చాలామంది మరణించిన వ్యక్తుల ఆధార్‌ను మోసపూరితంగా సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్రం దృష్టిలో పడింది. ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు my Aadhaar పోర్టల్‌లో నమోదు చేసే సౌకర్యాన్ని UIDAI ప్రారంభించింది.

ALSO READ: తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగం, డిజిటల్ కాపీ రిలీజ్ చేసిన రాష్ట్రపతి

కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో పలుమార్లు తొలగించింది కూడా. ఇలాంటి చర్యల వల్ల ఆధార్ డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఎవరి కార్డునైనా తొలగిస్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. UIDAI ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడు మళ్లీ మీ ఆధార్ యాక్టివేట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఒకసారి 2 కోట్ల మందిని తొలగించడం ఇదే ఫస్ట్ టైమ్.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×