E-Paper
Advertisement

బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు

బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు
Advertisement

Abhishek Banerjee Attack: బెంగాల్ లోని సోనార్ పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్ బెనర్జీ ఓ గ్రామంలో పర్యటిస్తుండగా ఆయనపై రాళ్లు, గుడ్లు, చెప్పులతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా దొంగ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయనపై భౌతిక దాడికి సైతం యత్నించారు.

బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం సోనార్ పూర్ కు చెందిన టీఎంసీ కార్యకర్త సంజూ కర్మాకర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన్ను పరామర్శించేందుకు ఇవాళ అభిషేక్ బెనర్జీ వెళ్లగా ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ బెనర్జీపై దాడికి యత్నించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆయన చొక్కా చినిగి ఉండటం కూడా వీడియో కనిపించింది. అభిషేక్ కు రక్షణగా పోలీసులు తమ హెల్మెట్ ను ఆయనకు ధరించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటు చేసుకున్నట్లు వైరల్ అవుతున్న దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

Advertisement

తనపై జరిగిన దాడి ఘటనపై అభిషేక్ బెనర్జీ స్పందించారు. దీనివెనుక బీజేపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ‘వారు నన్ను చంపాలని అనుకున్నారు. ఈ ఘటన మెుత్తం కెమెరాలో రికార్డ్ అయ్యింది. మేము ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. గవర్నర్ కు కూడా తెలియజేస్తాం. నేను తప్పకుండా న్యాయపోరాటం చేస్తా. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర. ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న దృక్పథానికి ఇదే నిదర్శనం. ఎన్నికలు జరిగి కనీసం నెల కూడా గడవలేదు. అప్పుడే దాడులకు యత్నిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు’ అని అభిషేక్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: కళ్ళజోడు తీస్తే ఎన్టీఆరా? దేవాన్ష్‌పై పేర్ని నాని సెటైర్లు.. ఏకిపారేస్తున్న టీడీపీ!

బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన 26 రోజుల తర్వాత అభిషేక్ బెనర్జీ తొలిసారి బయటకు వచ్చారు. సోనాపూర్ సౌత్ తో పాటు బేలేఘాటాలో ఎన్నికల అనంతరం దాడులు ఎదుర్కొన్న టీఎంసీ కార్యకర్తల కుటుంబాలని ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి జరగడం బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. మరోవైపు దీదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీఐడీ ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి నోటీసులు పంపింది. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం తమ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని సీఎం సువేందు అధికారి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

Also Read: నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×