E-Paper
Advertisement

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Air India Flight: విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన.. ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, కొద్దిసేపు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 2.20 గంటలకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి.. సుమారు 100 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. కానీ విమానం గగనతలంలోకి ఎగురుతున్న కొద్దిసేపటికే.. పైలట్‌కు సాంకేతిక లోపం ఉన్నట్లు కనిపించింది. ఆ లోపాన్ని గమనించిన వెంటనే పైలట్‌ అప్రమత్తమై.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)‌కు సమాచారం ఇచ్చారు.

ATC మార్గదర్శకత్వంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అత్యంత జాగ్రత్తగా ల్యాండింగ్ నిర్వహించడంతో.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. విమానం నేలపై సురక్షితంగా దిగిన వెంటనే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదమే తప్పింది.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. సాంకేతిక లోపం ఏమిటో పూర్తిగా గుర్తించేందుకు విమానాన్ని హ్యాంగర్‌కు తరలించి.. ఇంజనీర్లు తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మా ప్రాధాన్యం అని, అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా పైలట్‌ చాకచక్యాన్ని ప్రశంసించారు. విశాఖ విమానాశ్రయం అధికారులు కూడా వెంటనే అత్యవసర ఏర్పాట్లు చేశారు. ఫైర్ సర్వీసులు, మెడికల్ టీములు రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. అదృష్టవశాత్తూ పరిస్థితి అదుపులోకి రావడంతో.. అవి అవసరం లేకుండా పోయాయి.

ఈ ఘటనతో మరోసారి విమాన సాంకేతిక లోపాలపై.. దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. తరచుగా రొటీన్ మెయింటెనెన్స్ చెక్లు జరిగినప్పటికీ, కొన్నిసార్లు చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

Also Read: బ‌తుక‌మ్మ‌, దసరాకు.. TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు..

అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ సంఘటన తర్వాత విశాఖ–హైదరాబాద్‌ రూట్‌లో ఉన్న ఇతర విమాన సర్వీసులపై కూడా అధికారులు భద్రతా తనిఖీలు కఠినతరం చేశారు.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×