E-Paper
Advertisement

Anmol Bishnoi Arrest: అమెరికా నుంచి భారత్‌కు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

Anmol Bishnoi Arrest: అమెరికా నుంచి భారత్‌కు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

Anmol Bishnoi Arrest: గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో భారత దర్యాప్తు సంస్థలకు భారీ విజయం దక్కింది. బిష్ణోయ్ గ్యాంగ్‌లో రెండో అత్యంత కీలక నాయకుడిగా భావించే అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు భారత్‌కు విజయవంతంగా డిపోర్ట్ చేశారు. నకిలీ పాస్‌పోర్టుతో అమెరికాలో తలదాచుకున్న అన్మోల్‌ను గుర్తించిన అక్కడి ఏజెన్సీలు, భారత్-అమెరికా వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఢిల్లీకి పంపించాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అతడిని అధికారికంగా అరెస్టు చేశారు. ఇది రెండు దేశాల దర్యాప్తు సంస్థల మధ్య ఉన్న బలమైన సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అన్మోల్ బిష్ణోయ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు హై-ప్రొఫైల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య, ఇటీవల జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య, 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనల్లో ఇతడు కీలక సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై మొత్తం 18 క్రిమినల్ కేసులు నమోదై ఉండగా, ఈ అరెస్టుతో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలపై గట్టి దెబ్బ పడినట్లయింది.

బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్ కేవలం భారత్‌కే పరిమితం కాకుండా కెనడా, యూకే, పోర్చుగల్, ఇటలీ వంటి దేశాలకు విస్తరించి ఉంది. ఉత్తర భారతదేశంలోనే సుమారు 3,000 మంది షార్ప్ షూటర్లు ఈ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎన్‌ఐఏ విచారణలో అన్మోల్ ఫోన్, డిజిటల్ రికార్డులు మరియు కమ్యూనికేషన్ హిస్టరీని విశ్లేషించడం ద్వారా విదేశాల్లో దాగి ఉన్న ఇతర గ్యాంగ్ సభ్యుల వివరాలు, హత్య కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా అతడిని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు.

Read Also: Nagayalanka: ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు.. ఎక్కడంటే!

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×