BigTV English
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్.. ఎవరతను..?

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్.. ఎవరతను..?

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు సీబీఐ, ఇటు ఈడీ దూకుడు పెంచాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ 11 మంది నిందితులను అరెస్టు చేసింది.


రాబిన్ డిస్టిలరీస్ పేరుతో రామచంద్ర పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి రావడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరికొందరితో కలిసి తిరుమల సందర్శనకు వెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.

రామచంద్ర పిళ్లై ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామచంద్ర పిళ్లైతో కలిసి వ్యాపారం చేస్తున్న వారిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో రెండుసార్లు సోదాలు చేశారు. ఆ తనిఖీల్లో సేకరించిన వివరాల ఆధారంగా ఆయనను ఈడీ రెండురోజులపాటు ప్రశ్నించింది. తాజాగా రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయడం ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారిలో కలవరం రేగుతోంది. అలాగే సీబీఐ నమోదు చేసిన కేసులో రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను వారంరోజులపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత కోర్టు సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఈడీ అధికారులు కూడా సిసోడియాను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. తీహార్ జైలులో సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీ నిందితుల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నాయి. గత నెలరోజులుగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేశాయి. తాజాగా మరికొందరిని అరెస్ట్ చేస్తాయని వార్తలు వస్తున్నాయి. మరి సీబీఐ, ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో..?

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×