Plane Crash: అస్సాంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జోర్హాట్లోని భారత వైమానిక స్థావరంలో గురువారం ఒక సైనిక రవాణా విమానం రన్వేపై ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. భారత సైన్యానికి రక్షణ సామాగ్రి, నిత్యావసరాలను చేరవేసేందుకు ఉపయోగించే ఏఎన్-32 (AN-32) కార్గో విమానంగా దీనిని గుర్తించారు. సాంకేతిక లోపమా లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు IAF సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు . సమాచారం అందుకున్న వెంటనే వైమానిక దళానికి చెందిన ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విమాన శకలాల నుంచి పైలట్ను వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే ఇలాంటి కార్గో విమానం ప్రమాదానికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్!