E-Paper
Advertisement

అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇంతమంది భారతీయులు చనిపోయారా?

అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇంతమంది భారతీయులు చనిపోయారా?
Advertisement

Indian Casualties: అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంలో భారతీయులు కూడా మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. రాజ్యసభలో సీపీఐ ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను పంచుకున్నారు.

మరణాలు, గాయపడిన వారి వివరాలు

Advertisement

యుద్ధ పరిస్థితి కారణంగా 10 మంది నావికులతో సహా మొత్తం 16 మంది భారత జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు ఐదు విభిన్న దేశాల్లో నమోదయ్యాయి. ఒమన్‌లో ఎనిమిది మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నలుగురు, కువైట్‌లో ఇద్దరు, అలాగే సౌదీ అరేబియా, ఇరాక్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

అంతేకాకుండా.. ఈ ఘర్షణల్లో 75 మంది భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అత్యధికంగా యూఏఈలో 32 మంది, ఒమన్‌లో 24 మంది, కువైట్‌లో 13 మంది, ఖతార్‌లో నలుగురు, సౌదీ అరేబియా , ఇజ్రాయెల్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

Advertisement

తరలింపు చర్యలు, పరిహారం

యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరాన్ నుంచి ఇప్పటివరకు 2,557 మంది భారతీయులను సురక్షితంగా తరలించినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఇప్పటికీ దాదాపు 7,000 మంది భారతీయులు ఆ దేశంలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకునే క్రమంలో, ప్రాణాలు కోల్పోయిన 16 మంది భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. మిగిలిన భారతీయుల భద్రతను విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Also Read: హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

Tags

Related News

బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!

లీకు ముఠాను వదిలిపెట్టబోం.. పార్లమెంటులో బిల్లు ఆమోదం, ప్రధాని మోదీ మరొక వీడియో

కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం

కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ నిబంధన చెల్లదు!

మరణించిన రెండేళ్లకు క్లీన్ చీటా? సుప్రీం తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ అసహనం!

Big Stories

Advertisement
×