E-Paper
Advertisement

Karnataka : కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి.. ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ..

Karnataka : కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి.. ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ..
Advertisement

Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ముఖ్యనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు విమర్శలకు దిగారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. అధికారం దక్కాలంటే 113 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ లకు రిజర్వ్ చేయబడ్డాయి. మే 10న ఓటింగ్ జరుగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisement

ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఎన్నికలను ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 5.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. మరి కర్ణాటక ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ఎవరికి పట్టం కట్టబెడతారా ? ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×