E-Paper
Advertisement

IPL : ఉత్కంఠ పోరు.. పంజాబ్ పై కోల్‌కతా గెలుపు..

IPL : ఉత్కంఠ పోరు.. పంజాబ్ పై కోల్‌కతా గెలుపు..
Advertisement

IPL : చివరి బంతి వరకు ఉత్కఠంగా సాగిన పోరులో పంజాబ్ కు షాక్ తగిలింది. రింకూ సింగ్ కొట్టిన బౌండరీతో కోల్ కతా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (57) మినహా మరో బ్యాటర్ భారీ స్కోర్ చేయలేదు. కానీ జితేశ్ శర్మ (21), షారుక్ ఖాన్ (21 నాటౌట్), రిషి ధావన్ (19), హర్ ప్రీత్ బ్రార్ (17 నాటౌట్) కాస్త మెరుపులు మెరిపించడంతో పంజాబ్ మంచి స్కోర్ సాధించింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హర్షీత్ రాణా 2 వికెట్లు తీశారు. సుయాశ్ శర్మ, నితీశ్ రాణాకు తలో వికెట్ దక్కింది.

జేసన్ రాయ్ (38), నితీశ్ రాణా (51), రస్సెల్ (42) రాణించడంతో కోల్ కతా లక్ష్యం దిశగా సాగింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య చివరి ఓవర్ ఐదో బంతికి రస్సెల్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. కోల్ కతా విజయానికి చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఈ దశలో రింకూ సింగ్ మరోసారి మ్యాచ్ విన్నర్ గా మారాడు. చివరి బంతిని రింకూ సింగ్ (21 నాటౌట్) బౌండరికీ తరలించడంతో నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Advertisement

పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ కు రెండు వికెట్లు దక్కాయి. హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్ తలో వికెట్ తీశారు. పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిన రస్సెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×