E-Paper
Advertisement

Attack on Parliament: పార్లమెంట్ లో దాడి కేసు.. సూత్రధారి లలిత్ ఝాకి వారం రోజుల కస్టడీ..

Attack on Parliament: పార్లమెంట్ లో దాడి కేసు.. సూత్రధారి లలిత్ ఝాకి వారం రోజుల కస్టడీ..
Advertisement

Attack on Parliament: పార్లమెంట్‌లో స్మోక్ బాంబ్‌ దాడి సూత్రధారి లలిత్‌ ఝా కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లలిత్‌కు వారం రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. పార్లమెంట్‌లో దాడి ఘటనలో లలిత్ ఝాను కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతను కీలక ఆధారాలను ధ్వంసం చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. కీలక సూత్రధారి లలిత్ బయటే ఉండి వీడియోలు రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులకు ఇప్పటికే పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

అయితే ఈ దాడిలో తమ ప్లాన్ అమలు కాకపోతే ప్లాన్-బీ కూడా ఉన్నట్లు మాస్టర్ మైండ్ లలిత్ ఝా విచారణలో తేలింది. ఏదైనా కారణాల వల్ల నీలం, అమోల్‌లు పార్లమెంట్‌కి చేరుకోకుంటే.. మహేష్, కైలాష్ అనే ఇద్దరు వ్యక్తలు పార్లమెంట్ చేరుకుంటారని, స్మోక్‌ బాంబు పేల్చాలని ప్లాన్ చేశారు. అయితే మహేష్, కైలాష్ ఇద్దరు కూడా గురుగ్రామ్ లోని మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీ ఇంటికి చేరుకోలేకపోయారు.

Advertisement

లలిత్ ఈ ఘటన తర్వాత నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు తీసుకొని ప్లాన్ ప్రకారం ఎక్కడైనా దాక్కోవాలని ప్లాన్ చేశాడు. రాజస్థాన్‌లో సాయం చేసే బాధ్యతను మహేష్‌కి అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే లలిత్, మహేష్ ఇద్దరూ గురువారం రాత్రి కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×