Bastar Mining Mafia: బస్తర్ అడవుల్లో ఏం జరుగుతోంది? హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అసలు మైనింగ్ మాఫియా ఎప్పుడు ఎంటర్ అయిందని చూస్తే.. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత రోజుల వ్యవధిలోనే మైనింగ్ మాఫియా అడవుల్లోకి చొరబడి మొత్తం తవ్వకాలు చేస్తున్నారంటూ ఒక వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. హిడ్మా ఎన్కౌంటర్ ఇందుకే చేశారా..? తవ్వకాలు జరిపేందుకే హిడ్మాను హతమార్చారా అంటూ.. ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
ఇప్పటివరకు తాము చేసిన పోరాటం అంతా వృధా అయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అడవులు లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అడవులు పచ్చగా ఉంటాయి. కానీ ఈ తవ్వకాల అనంతరం మొత్తంగా అడవుల ఎరెపెక్కినట్లు వారు చెప్తూ ఉన్నారు. గుట్టను మైనింగ్ వ్యాపారులు తవ్వేస్తున్నారని ఇన్ స్టాలో ఓ మహిళ వీడియో పోస్ట్ చేసింది.
సాధారణంగా అడవులు పచ్చగా ఉంటాయని, తవ్వకాల తర్వాత ఎరుపెక్కాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. బస్తర్ అడవుల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని, మా పిల్లలకు అడవులు లేకుండా చేస్తువన్నారని, ఇప్పటి వరకు చేసిన పోరాటం అంతా వృధా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
Also Read: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్ఏలో ఉందన్న ప్రధాని మోదీ
గతంలో బస్తర్ జోన్కు హిడ్మా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే గుట్టల తవ్వకాల కోసమే హిడ్మాను ఎన్ కౌంటర్ చేశారా అంటూ విమర్శలు వెల్లువెత్తతున్నాయి. మొత్తంగా హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందనే చెప్పాలి. హిడ్మా మృతి చెందిన రోజుల వ్యవధిలోనే పనులు మొదలుపెట్టారంటూ వీడియోలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.
బస్తర్ వీడియో
హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం బస్తర్ అడవుల్లో మైనింగ్ చేయడం మొదలుపెట్టారని తెలుపుతున్న వీడియో pic.twitter.com/TD8is12a6M
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025