E-Paper
Advertisement

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే కూలిన వంతెన..

Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోయింది. అట్లుంటది మరి మన ఇంజినీర్లు, కాంట్రాక్టుల పనితనం. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మిస్తే ప్రారంభానికి ముందేం కర్మ కట్టకముందే కూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిహార్‌లో ఓ బ్రిడ్జి ఇలానే ప్రారంభానికి ముందే కుప్ప కూలిపోయింది. బ్రిడ్జిపై వాహనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బిహార్​లోని బెగూసరాయ్​లో గండక్​ నదిపై 2017లో ఈ వంతెనను నిర్మించారు. మా భగవతి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి 13 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు. ఆఫీషియల్‌గా ఇంకా ప్రారంభించకపోయినా బ్రిడ్జిపై వాహన రాకపోకలు మత్రం సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు కూడా కాకముందే కుప్పకూలిపోయింది.

ఆ సమయంలో వంతెనపై వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్​ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×