E-Paper
Advertisement

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన
Advertisement

TVK Vijay: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీవీకే పార్టీ అధినేత విజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు.

ఘటన ఎంతో కలిచివేసింది…

Advertisement

కరూర్ తొక్కిసలాట ఘటన తనను ఎంతోగానూ కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు.. ఎంతో ప్రేమతో తన నిర్వహించిన మీటింగ్ కు ప్రజలు భారీ గా వచ్చారని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పిస్తానని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే నిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఏ తప్పు చేయకపోయినా తమ నేతలపై కేసు పెట్టారని అన్నారు.
కావాలంటే సీఎం స్టాలిన్ తనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు.

ALSO READ: SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Advertisement

మరింత బలంగా బయటకు వస్తా..

ఇలాంటి ఘటన కరూర్ లోనే ఎందుకు జరిగింది..? అనేది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఎలా జరిగిందో అసలు తెలియడం లేదని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ ఘటనకు కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ జరిగిందని పేర్కొన్నారు. తాను ఇప్పుడు మరింత బలంగా బయటకు వస్తానని తెలిపారు.

ALSO READ: Minor Girl Molested: ఏపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం.. గర్భం దాల్చిన చిన్నారి

గుండె బాధతో మునిగిపోయింది.. విజయ్ ఎమోషనల్

ఈ ఘటన గురించి ఆలోచిస్తుంటే.. తన గుండె బాధతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదుర్కొలేదని అన్నారు. తొక్కిసలాటలో41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సందని.. మా నేతల తప్పులు లేకపోయినా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని టీవీకే పార్టీ అధినేత విజయ్ పేర్కొన్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×