E-Paper
Advertisement

Telangana Congress : సీనియర్ల వైఖరిపై అధిష్టానానికి రేవంత్ వర్గం లేఖ..

Telangana Congress : సీనియర్ల వైఖరిపై అధిష్టానానికి రేవంత్ వర్గం లేఖ..
Advertisement

Telangana Congress : సేవ్‌ కాంగ్రెస్‌ అంటూ కాంగ్రెస్‌లో కల్లోలం రేపిన సీనియర్లకు… రేవంత్‌ వర్గం నేతలు దీటైన కౌంటర్ ఇచ్చారు. కొత్త కమిటీల్లో తమకు కల్పించిన పదవులకు రాజీనామా చేశారు. తాజా పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు లేఖ రాసిన నేతలు… రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వివరించారు.

తమకు పదవులు ముఖ్యం కాదని.. రేవంత్‌ నాయకత్వంలో… పనిచేసి కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతోనే తాము పార్టీలోకి వచ్చామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమకు పదవులు ఇవ్వడమే సీనియర్లకు అభ్యంతరమైతే.. అలాంటి పదవులు తమకు అవసరం లేదంటూ ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపనున్నారు.

Advertisement

టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని… ఎప్పుడు కేసీఆర్‌ను గద్దె దించేద్దామా అని చూస్తున్నారని… రేవంత్‌ వర్గం నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కలసికట్టుగా పోరాటం చేసి కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవడానికి ఇది సరైన సమయమని… ఇలాంటి కీలక సమయంలో సీనియర్లు గందరగోళం సృష్టించడం సరైనది కాదని అంటున్నారు.

పార్టీలో వరుస సంక్షోభాలతో ప్రజల్లో చులకన అవుతున్నామంటూ రేవంత్‌ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో పదవులు కట్టబెట్టిన హైకమాండ్‌కు ధన్యవాదాలు చెబుతూనే.. పీసీసీ కమిటీల్లోని తమ పదవులకు రాజీనామా సమర్పిస్తున్నట్లు రేవంత్ వర్గం నేతలు తమ లేఖలో వెల్లడించారు.

Related News

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

Big Stories

Advertisement
×