03:00 PM
204 స్థానాల్లో NDA
32 స్థానాల్లో మహాగట్ బంధన్
7 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
02:30 PM
203 స్థానాల్లో NDA
33 స్థానాల్లో మహాగట్ బంధన్
7 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
02:00 PM
202 స్థానాల్లో NDA
35 స్థానాల్లో మహాగట్ బంధన్
6 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
01:30 PM
202 స్థానాల్లో NDA
36 స్థానాల్లో మహాగట్ బంధన్
5 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
01:00 PM
197 స్థానాల్లో NDA
40 స్థానాల్లో మహాగట్ బంధన్
5 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
12:30PM
196 స్థానాల్లో NDA
42 స్థానాల్లో మహాగట్ బంధన్
5 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
12: 00 PM
189 స్థానాల్లో NDA
51 స్థానాల్లో మహాగట్ బంధన్
3 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
11: 30 AM
193 స్థానాల్లో NDA
47 స్థానాల్లో మహాగట్ బంధన్
4 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
11:00AM
ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 191 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
49 స్థానాల్లో మహాగట్ బంధన్
3 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
10: 30AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీయే భారీ ఆధిక్యాల్లో దూసుకెళ్తోంది. ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 175 స్థానాల ఆధిక్యం లో కొనసాగుతున్నారు. 64 స్థానాల్లో మహాగట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అలీనగర్లో సింగర్ మైథిలీ ఠాకూర్ ముందంజలోకి వచ్చారు. మొకామాలో జేడీయూ అభ్యర్థి అనంత కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. మహువా లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజలోకి వచ్చారు. ఇక ప్రశాంత్ కిశోర్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది.
10:00 AM
బీహార్లో మ్యాజిక్ ఫిగర్ 122 దాటిన ఎన్డీయే
ఎన్డీయే కూటమి 161, ఎంజీబీ 79, జేఎస్పీ 1 సీట్లలో ఆధిక్యం
కేవలం 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్
38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో తుది ఫలితం వెల్లడికానుంది. మొత్తం 2వేల 616 మంది అభ్యర్థుల భవిత్యవం తేలిపోనుంది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా అధికారంలోకి రావడానికి 122 స్థానాలు గెలిస్తే చాలు. అయితే ఈసారి అత్యధికంగా 67.13శాతం పోలింగ్ నమోదైంది. అంటే గతసారి కంటే 9.62శాతం ఓటింగ్ పెరిగింది.
అయితే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ సెంటర్లలో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తరువాత రాష్ట్ర పోలీసు బలగాలతో పహారాను ఏర్పాటు చేశారు. 24/7 సీసీటీవీ నిఘా కూడా ఉంది.
ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో 67.13 శాతం మేర పోలింగ్ జరిగింది. దీంతో, ప్రజాతీర్పుపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కూటమి నేత తేజస్వీ యాదవ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.