E-Paper
Advertisement

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. బిజేపీ నాయకుడు సురేశ్ కరమ్‌షీ నఖుఆ తనను హింసను ప్రేరేంపించే, అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక్తిగా తన ఛానెల్ వీడియోలో పేర్కొన్నాడని ఆరోపిస్తూ.. ధృవ్ రాఠీపై ఆయన పరువు నష్టం దావా కేసు వేశాడు. ఢిల్లీ లోని జిల్లా కోర్టు ఈ కేసుని ఆగస్టు 6న విచారణ చేయనుంది.

‘గోదీ యూట్యబర్స్ నా సమాధానం, ఎల్విష్ యాదవ్’ అనే పేరుతో ధృవ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్ లో జూలై 7, 2024 న ఓ వీడియో అప్ లోడ్ చేశాడు. ”ఈ వీడియోలో తనను హింసను ప్రేరేంపించే వ్యక్తి అని, ఇతరులతో నేను అసభ్య పదజాలంతో మాట్లాడుతానని వారిపై దాడి చేస్తానని ధృవ్ రాఠీ చెప్పాడు. దీనికి ఎలాంటి ఆధారాలు లేదు. కేవలం తన పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అతను ఇలా చెప్పాడు,” అని బిజేపీ నాయకుడు తన పిటీషన్ లో పేర్కొన్నాడు.

Also Read: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు

ధృవ్ రాఠీ వీడియోలు కోట్ల మంది చూస్తారని.. వీడియోల్లో అతను చెప్పిన రెచ్చగొట్టే విషయాలు.. సోషల్ మీడియాలో కార్చిచ్చులా వేగంగా వ్యాపిస్తాయని.. దాని వల్ల తను పరువు భంగం కలుగుతోందని సురేష్ వాదన. తన వీడియాల ద్వారా అబద్ధలు ప్రచారం చేయడమే కాకుండా.. ధృవ్ రాఠీ హింసను ప్రేరేపిస్తున్నాడని సురేష్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

ధృవ్ రాఠీ తన వీడియోల్లో చెప్పే విషయాలను చాలా మంది ఖండిస్తున్నారని.. అయినా అతను ఉద్దేశ పూర్వకంగాన తనపై ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నాడని బిజేపీ నాయకుడు సురేష్ కోర్టుకు విన్నవించుకున్నాడు. సమాజంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలనే ఇదంతా కుట్ర ప్రకారం.. ధృవ్ రాఠీ వెనుకు ఉండి ఎవరో చేస్తున్నారని చెప్పాడు. ప్రజల్లో తన పట్ల అనుమానం కలిగించే విధంగా వ్యాఖ్యలు ధృవ్ రాఠీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తన పిటీవషన్ లో కోరాడు.

Also Read: ట్రంప్ హత్యాయత్నం.. భద్రతా వైఫల్యం విమర్శలతో అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా!

 

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×