BJP Fights Solo in Lok Sabha & Assembly Polls in Odisha Elections 2024: ఒడిశాలో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ మన్మోహన్ సమాల్ శుక్రవారం వెల్లడించారు. ఎన్నికల కోసం బీజేపీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.
ఒడిశాలోని లోక్సభలోని మొత్తం 21 స్థానాలు, శాసనసభలోని మొత్తం 147 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి గెలుస్తుందని మన్మోహన్ సమాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఒడిశా ప్రజలు ఆంకాక్షలు నెరవేర్చడానికి బీజేపీ 21 లోక్సభ స్థానాల్లో, 147 శాసనసభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని సమాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఒడిశాలోని ప్రస్థుత ప్రభుత్వం మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరిగా అమలు చేయట్లేదని, పేదవారికి చేరడం లేదని తెలిపారు.
Also Read: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్ పోటీ..
ఒడిశాలోని అనేక సంక్షేమ పథకాలు ఒడిశాలో పేదలకు అందడం లేదు, దీని కారణంగా ఒడిశాలోని పేద సోదరీ, సోదరీమణులు ప్రయోజనాలను పొందడం లేదు. ఒడిశా-గుర్తింపు, ఒడిశా-అభిమానం, ఒడిశా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై మాకు ఆందోళనలు ఉన్నాయి.” అని ఆయన అన్నారు.