E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌.. స్పాట్‌లో 37 మంది!

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌.. స్పాట్‌లో 37 మంది!
Advertisement

Jammu Kashmir: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనను మరువక ముందే.. జమ్మూ కశ్మీర్‌లో మరో బాంబ్ బ్లాస్ జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ 30 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువగా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఉన్నారని సమాచారం.

300 అడుగుల దూరంలో దొరికిన శరీర భాగాలు..
పేలుడు దాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 300 అడుగుల దూరంలో కొన్ని శరీర భాగాలు గుర్తించారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రమాదవశాత్తు జరిగిన పేలుడా.. ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా..
ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగిన పేలుడని అధికారులు మొదట ప్రాథమిక నివేదికనిచ్చారు. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను, నమూనాలను పరిక్షిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న 360 కిలోల రసాయనాలు పేలినట్లు తెలుస్తుంది.

భారీగా ఎగసిపడ్డ మంటలు..
భారీ పేలుడుతో పోలీస్‌ స్టేషన్‌ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటుచేసుకోవడంతో రెస్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.

Advertisement

ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. ఈ బ్లాస్ట్‌కు జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ PAFF ఇప్పటికే బాధ్యత తీసుకుంది.

అక్టోబర్‌లోనే నౌగామ్‌లో ఉగ్రకదలికలను గుర్తించారు. బెదిరింపు పోస్టర్లు అంటించిన ఘటనపై ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. సీసీటీవీ ఆధారంగా ముగ్గురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్ అనే వ్యక్తి పాత్ర ఉందని తేలింది. తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేసి 360 కిలోల అమోనియం నైట్రేట్‌తోపాటు ఐఈడీ తయారీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పుల్వామాకు చెందిన మరో డాక్టర్‌ను గుర్తించి 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికి ఈ బ్లాస్ట్‌తో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×