OTT Movie : ఎట్టకేలకు నీరు బజ్వా, తానియా జంటగా నటించిన పంజాబీ చిత్రం ‘ఫాఫే కుట్నియన్’ చివరకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు డిజిటల్ ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఈ సినిమా కథ పంజాబ్ కిట్టీ పార్టీలలో మోసాలు చేస్తూ లైఫ్ ని లీడ్ చేసే ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే
ప్రేమ్ సింగ్ సిద్ధు దర్శకత్వం వహించిన ఈ పంజాబీ కామెడీ చిత్రం ‘ఫాఫే కుట్నియన్’ (Phaphey Kuttniyan). ఇందులో నీరు బజ్వా, తానియా లీడ్ రోల్స్ లో నటించగా, అమృత్ అంబి, నిషా బానో, ప్రభ్ బెయిన్స్, గుర్బాజ్ సింగ్, అనితా మీట్, జగ్తార్ బెనిపాల్ సహాయక పాత్రల్లో నటించారు.
ఈ పంజాబీ డ్రామా 2025 ఆగస్ట్ 22న థియేటర్లకి వచ్చింది.ఇప్పుడు చౌపాల్, ఓటీటీ ప్లే ప్రీమియంలో నవంబర్ 13 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
పంజాబ్లోని ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో సిమ్రన్, గులాబో అనే ఇద్దరు హౌస్వైవ్స్ ఉంటారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున ఒక ఐడియా తో కలసి ముందుకు వెళతారు. ప్రతి నెలా కిట్టీ పార్టీలు పెట్టి, చిన్న చిన్న గేమ్స్ ఆడి, డబ్బులు గెలుస్తుంటారు. నిజానికి వాళ్లు చీటింగ్ చేసి ఈ డబ్బులు సంపాదిస్తుంటారు. ఇలా గెలిచిన డబ్బుతో వాళ్లు గ్లామరస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒక రోజు పోలీస్ ఇన్స్పెక్టర్ రణజీత్ వీళ్ళ మీద అనుమానంతో సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. సిమ్రన్ భర్త ఒక చిన్న జాబ్ చేస్తుండటంతో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అని అనుమానం ఎక్కువ అవుతుంది. గులాబోకి ఒక బాబు ఉంటాడు. ఆమె డబ్బును ఎక్కువగా అతని స్టడీస్ కోసం యూజ్ చేస్తుంటుంది. కానీ ఒక బిగ్ కిట్టీ పార్టీలో వాళ్ల ట్రిక్ బయట పడుతుంది. ఒక రిచ్ లేడీ వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తుంది. నాకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు చెప్తానాని బెదిరిస్తుంది.
Read Also : స్మశానంలో శవాలు తవ్వే సైకో… ఆ ఊళ్ళో ఆడపిల్లలు పుడితే అంతే సంగతులు… క్రేజీ కన్నడ మిస్టరీ థ్రిల్లర్