E-Paper
Advertisement

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

3 Schools in Tamil Nadu Receive Threatening E-Mails: దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా పాఠశాలలతో పాటు షాపింగ్ మాల్స్, హోటల్స్‌, విమానాశ్రయాలకు బెదిరింపుల కాల్స్ వరుసగా వస్తున్నాయి. ఇలా ఈ బాంబు బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా, తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బెదిరింపుల కాల్స్ రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

మదురైలోని కేంద్రీయ విద్యాలయం, జీవన్ స్కూల్, వేలఅమ్మాల్ వంటి విద్యాసంస్థలకు సెప్టెంబర్ 30న ఉదయం బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ మెయిల్స్ వచ్చాయి. కొంతమంది గుర్తుల తెలియని వ్యక్తులు ఈ మూడు విద్యాసంస్థలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ మెయిల్స్ వచ్చిన వెంటనే విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన మూడు బృందాలుగా ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

ఈ మేరకు పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సహాయంలో మూడు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు క్షుణ్ణంగా చేసిన తనిఖీలు ఎలాంటి బాంబు స్వాధీనం కాలేదు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలపై ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

మరోవైపు, తమిళనాడులో పాఠశాలలకు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తొలుత ఏ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలియక టెన్షన్ పడ్డారు. తర్వాత మూడు పాఠశాలలకు అని తెలిసిన వెంటనే భయాందోళన గురయ్యారు. ఎలాంటి బాంబు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×