E-Paper
Advertisement

Road Safety Reward: ప్రాణం కాపాడండి.. రూ. 25,000 గెలుచుకోండి.. కేంద్రం తెచ్చిన పథకం విశేషాలివే!

Road Safety Reward: ప్రాణం కాపాడండి.. రూ. 25,000 గెలుచుకోండి.. కేంద్రం తెచ్చిన పథకం విశేషాలివే!

Road Safety Reward: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే సామాన్యులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమయంలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే ‘గుడ్ సమారిటన్ల’కు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఐదింతలు పెంచింది. ఈ మేరకు అమలులోకి వచ్చిన ‘రహ్‌-వీర్‌’ (Rah-Veer) పథకానికి సంబంధించిన వివ‌రాలు ఇక్కడ ఉన్నాయి.

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 5,000 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం రూ. 25,000కు పెంచింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదానికి గురైన బాధితులకు మొదటి ఏడు రోజుల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. దీని కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు.

నగదు బహుమతితో పాటు, సదరు వ్యక్తికి ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్‌ను కూడా అందజేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను (Golden Hour) అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితుడిని ఆసుపత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పది మంది అత్యుత్తమ రహ్‌-వీర్‌లను ఎంపిక చేస్తారు. వారికి రూ. 1 లక్ష నగదు పురస్కారం, సర్టిఫికేట్ మరియు ట్రోఫీని అందజేస్తారు.

ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించినప్పుడు పోలీసులు లేదా వైద్యులు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తుంది. ఒక వ్యక్తికి సంవత్సరానికి గరిష్టంగా ఐదుసార్లు మాత్రమే ఈ అవార్డును అందజేస్తారు.

ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఒకే బాధితుడిని కాపాడితే, ఆ రూ. 25,000 మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. ఎంపికైన వారి వివరాలను నిర్ధారించుకున్న తర్వాత, ప్రోత్సాహక మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.

Read Also: Nizamabad BJP: నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ వ్యూహం మారిందా? మేయర్ సీటుకు కొత్త ట్విస్ట్!

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×