Seethakka: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ములుగు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ములుగుకు చేసిన మేలును ప్రజలకు వివరించారు.
ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ములుగు మున్సిపాలిటీగా ఏర్పడటం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కృషీ ఉందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. గత ప్రభుత్వం జిల్లాను మూడు ముక్కలు చేసిందని.. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి అప్పటి ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవోలు తెచ్చిందని.. కానీ ప్రజలు తన వెంటే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఏర్పాటు అంశంపై తప్పుడు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్న వారికి చెక్ పెడుతూ.. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంగా ములుగును అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని సీతక్క హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కాంక్షించి, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య
ములుగు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : మంత్రి సీతక్క
ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి అభివృద్ధికి బాటలు వేయండి
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరు
మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ… pic.twitter.com/8iEaOPjRYk
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2026