BigTV English
Advertisement

112 Kgs Drugs Seized: చెన్నై పోర్టు.. 100 కోట్ల డ్రగ్స్ సీజ్, కాకపోతే..

112 Kgs Drugs Seized: చెన్నై పోర్టు.. 100 కోట్ల డ్రగ్స్ సీజ్, కాకపోతే..

112 Kgs Drugs Seized: దేశంలో డ్రగ్స్ వినియోగం చాప కింద నీరుగా సాగుతోంది. ఎక్కడో దగ్గర భారీ ఎత్తున పట్టుబడుతున్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్రం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా ఎక్కడో దగ్గర భారీగా పట్టుబడుతున్నాయి.


తాజాగా చెన్నై పోర్ట్‌లో భారీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కంటైనర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడిన కంటెయినర్ చెన్నై పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ మాఫియా గుజరాత్ నుంచి చెన్నైకి షిప్ట్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు ముఠాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్ తీరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుమారు 86 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.


తాజాగా చెన్నై పోర్టులో 112 కేజీల డ్రగ్స్ పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. పట్టుబడిన డ్రగ్స్‌తోపాటు రెండు లగ్జరీ కార్లు ఉన్నట్లు అంతర్గత సమాచారం. దాదాపు నాలుగు లక్షల క్యాష్ సైతం పట్టు బడింది.

ALSO READ: మోదీ ఏమీ దేవుడు కాదు : కేజ్రీవాల్

చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు వాటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. అరెస్టయిన వారి నుంచి వివరాలు సేకరించే పనిలో కస్టమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. కంటెయినర్‌లో 450 బ్యాగ్‌లను గుర్తించింది. వాటిని పరిశీలించగా 37 క్వార్ట్జ్ పౌడర్ బ్యాగుల్లో దాదాపు 3 కిలోల సూడోపెడ్రిన్‌తో కూడిన 37 ప్యాకెట్లను ఉన్నట్లు తేలింది.

ఎక్కడ నుంచి చెన్నై పోర్టుకి తీసుకొచ్చారు? ఆస్ట్రేలియాలో ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. తీగ లాగితే డొంక కదలడం ఖాయమని భావిస్తున్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×