Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పుల్లో..12 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డి కాల్పులు జరిపారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
“సుక్మా జిల్లా కిష్టారామ్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారంతో..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం దక్షిణ బస్తర్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లో ఉంది. శనివారం ఉదయం 5.00 గంటల నుండి DRG, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఎన్కౌంటర్ స్థలం నుండి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాం” – బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్
Also Read: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి