E-Paper
Advertisement

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే

Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే

Pakistan Visa: ఎవరికైనా పాస్‌పోర్టు, వీసా ఎప్పుడు అవసరముంటుంది? వేరే దేశానికి వెళ్లితేనే కదా! కానీ, భారత్‌లోనే ఉండే ఈ రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్రయాణికులు తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా తీసుకెళ్లాలి. లేదంటే.. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టనివ్వరు. అంతేకాదు, ఈ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిత్యం సీసీటీవీల నిఘా నీడలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్‌లోకి కనీసం పోర్టర్లను కూడా అనుమతించరు. ఎవరి లగేజీ వారే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి కఠినమైన నిబంధనలు ఉన్నా.. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

ఈ రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉన్నది. అదే పంజాబ్‌లోని అత్తారి శ్యాం సింగ్ రైల్వే స్టేషన్‌. ఇది ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య వ్యూహత్మక ప్రాంతంలో ఉండటం చేత ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అమృత్‌సర్ – లాహోర్ లైన్‌లో భారత్ వైపున్న చివరి రైల్వే స్టేషన్ ఇది.

ఉభయ దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజలు తమ ప్రయాణాలు చేసేవారు. రెండు దేశాలను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్.. ఉభయ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతో నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ సేవలు అందించినప్పుడు ఈ అత్తారి రైల్వే స్టేషన్‌లోనే ప్రయాణాన్ని ప్రారంభించేది. ఈ రైల్వే స్టేషన్‌ను ఫిరోజ్‌పూర్ డివిజన్ నిర్వహిస్తుంది.

Also Read: Anchor Shyamala: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

2022లో ఈ విషయాన్ని అమృత్ మహోత్సవ్ కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. భారత్‌లోనే ఉండే ఓ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు వీసా ఉండాలని మీకు తెలుసా? అంటూ ట్వీట్ చేసింది. అమృత్‌సర్‌లోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టాలంటే భారతీయులకు కూడా కచ్చితంగా వీసా ఉండాలని పేర్కొంది. కాగా, ఈ పోస్టు కింద ఓ నెటిజన్ కీలక కామెంట్ చేశాడు. పాకిస్తాన్‌ వైపు కూడా ఇలాంటి రైల్వే స్టేషన్ ఉన్నదని పేర్కొన్నాడు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×