E-Paper
Advertisement

Class X Student heart failure: రాజస్థాన్‌లో విషాదం, గుండెపోటుతో స్టూడెంట్ మృతి..

Class X Student heart failure: రాజస్థాన్‌లో విషాదం, గుండెపోటుతో స్టూడెంట్ మృతి..

Class X Student heart failure: ఈ మధ్యకాలం దేశంలో గుండె పోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ కుప్పకూలుతున్నారో తెలియలేదు. ఆ తరహా కేసులో వారానికి నాలుగైదు నమోదు అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రాజస్థాన్‌లో గుండెపోటుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్పాట్‌లో మృతి చెందారు.

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన యతేంద్ర బండికుయ్‌లో పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు పాఠశాలకు వచ్చాడు. కారిడార్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలో ఆయా దృశ్యాలు రికార్డు అయ్యాయి.

తరగతి రూమ్‌‌లోకి వెళ్తుండగా కారిడార్‌లో కుప్పకూలిపోయాడు యతేంద్ర. వెంటనే పాఠశాల నిర్వాహకులు వెంటనే విద్యార్థిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. యతేంద్ర మెడికల్ రిపోర్టు ప్రకారం.. యతేంద్రకు చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉంది. గుండె హోల్ పడినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు.

పాఠశాల యాజమాన్యం పేరెంట్స్‌కి యతేంద్ర మృతి విషయం చెప్పింది. వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో బాబుకు పోస్టుమార్టం నిర్వహించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. యతేంద్ర అంత్యక్రియల కోసం కుటుంబసబ్యులు పూర్వీకుల గ్రామానికి బయలుదేరి వెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

ALSO READ:  బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..

అంతకుముందు రోజు అంటే శుక్రవారం యతేంద్ర.. తోటి స్టూడెంట్స్‌తో ఉల్లాసంగా గడిపాడు. క్లాస్ రూమ్ లోకి విద్యార్థులకు చాక్లెట్లు పంచిబెట్టాడు. ఇంట్లో కేక్ కట్ చేసి ఫోటోలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తోటి విద్యార్థులు షాకయ్యారు.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×