BigTV English

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమయంలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కడానికి ప్రయత్నించిన సీఎం .. బీహార్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని అన్నారు. బీజేపీ కాళ్ల దగ్గర బీహార్ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెట్టారంటూ విమర్శించారు.


ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ పాదాలను నితీష్ తాకడం సరికాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని.. అలాంటి వ్యక్తి ప్రధాని మోదీ పాదాలను తాకి బీహార్ అవమానపడేలా చేశారని విమర్శించారు. గతంలో నితీష్ కుమార్‌తో పని చేసి, ఇప్పుడు ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.వారికి సమాధానంగా అప్పుడు సీఎం నితీష్ ఇప్పటిలాగా లేరని చెప్పారు.

Also Read :  ప్రధానిని టార్గెట్ చేసిన ఆర్ఎస్ఎస్ నేతలు.. ప్రమాదంలో మోడీ పదవి ?


గతంలో నితీష్ కుమార్ తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని తెలిపారు. కానీ ఇప్పుడు బీహార్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసారని అన్నారు. మోదీ మూడో సారి ప్రధాని కావడంలో నితీష్ పాత్ర ఎంతో ఉందని చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం నితీష్ కుమార్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం తనకున్న బలాన్ని వినియోగించడం లేదని తెలిపారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×