E-Paper
Advertisement

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు
Advertisement

Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమయంలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కడానికి ప్రయత్నించిన సీఎం .. బీహార్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని అన్నారు. బీజేపీ కాళ్ల దగ్గర బీహార్ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెట్టారంటూ విమర్శించారు.

ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ పాదాలను నితీష్ తాకడం సరికాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని.. అలాంటి వ్యక్తి ప్రధాని మోదీ పాదాలను తాకి బీహార్ అవమానపడేలా చేశారని విమర్శించారు. గతంలో నితీష్ కుమార్‌తో పని చేసి, ఇప్పుడు ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.వారికి సమాధానంగా అప్పుడు సీఎం నితీష్ ఇప్పటిలాగా లేరని చెప్పారు.

Advertisement

Also Read :  ప్రధానిని టార్గెట్ చేసిన ఆర్ఎస్ఎస్ నేతలు.. ప్రమాదంలో మోడీ పదవి ?

గతంలో నితీష్ కుమార్ తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని తెలిపారు. కానీ ఇప్పుడు బీహార్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసారని అన్నారు. మోదీ మూడో సారి ప్రధాని కావడంలో నితీష్ పాత్ర ఎంతో ఉందని చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం నితీష్ కుమార్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం తనకున్న బలాన్ని వినియోగించడం లేదని తెలిపారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×