E-Paper
Advertisement

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి
Advertisement

Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఒక వ్యాన్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అమాయక పాఠశాల విద్యార్థులు ఉండటం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ రైల్వే పట్టాలపై పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తున్నాయి.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?
నిత్యం రద్దీగా ఉండే కర్ణసువర్ణ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే స్కూల్ వ్యాన్ విద్యార్థులతో బయలుదేరింది. అయితే, లెవెల్ క్రాసింగ్ వద్దకు చేరుకునే సరికి రైల్వే గేట్ తెరిచే ఉంది. గేట్ తెరిచి ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేదని భావించిన వ్యాన్ డ్రైవర్, పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో నిమ్ తీతా నుండి కటావా వైపు వేగంగా దూసుకొస్తున్న ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా వ్యాన్‌ను ఢీకొట్టింది. రైలు వేగానికి వ్యాన్ చాలా దూరం ఈడ్చుకువెళ్లబడటంతో అందులోని వారు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

రంగంలోకి సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను, ఇతరులను బయటకు తీసి అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్
ఈ ఘోర ప్రమాదానికి రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. రైలు వస్తున్న సమయంలో లెవెల్ క్రాసింగ్ గేట్ వేయకుండా తెరిచి ఉంచడంపై తూర్పు రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ సంబంధిత గేట్ మ్యాన్, సూపర్ వైజర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, ప్రమాదానికి గల పూర్తి కారణాలను అన్వేషించడానికి, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 10 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని రైల్వే శాఖ రంగంలోకి దించింది.

Advertisement

Also Read: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

Related News

ఇస్రోలో సంక్షోభం.. 120 శాస్త్రవేత్తలు రాజీనామా, రంగంలోకి కేంద్రం, కీలక మిషన్ల మాటేంటి?

ఆస్తి కోసం కన్న తండ్రినే కాటేసిన కొడుకు.. ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!

నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే?

సినిమా స్టయిల్‌లో 20 కార్లతో వచ్చి.. కోటి ఇవ్వకుంటే చస్తావ్, గురుగ్రామ్‌లో ఘటన

డ్రైనేజీలో స్నానం.. అక్కడే భోజనం.. వ్యూస్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ పునీత్ పిచ్చి వేషాలు

Big Stories

Advertisement
×