BigTV English

Chidambaram comments on Modi, Shah age remarks: అమిత్ షా కామెంట్స్ రివర్స్, మోదీకి తగిలిందా?

Chidambaram comments on Modi, Shah age remarks: అమిత్ షా కామెంట్స్ రివర్స్, మోదీకి తగిలిందా?

Chidambaram comments on Modi, Shah age remarks: సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిషా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఒకే అంశంపై రచ్చ కొనసాగుతోంది. ఈసారి కమలనాథులు ఒడిషాలో పాగా వేయాలని స్కెచ్ వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్లాన్‌ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు.


సీఎం నవీన్ పట్నాయక్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయి. చివరకు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. మోదీకి అమిత్ షా ఎర్త్ పెడుతున్నారంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసింది. అసలేం జరిగింది.

ఒడిషాలో ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ వయస్సుపై కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి అమిత్ షా. నవీన్‌‌కు ఇప్పుడు 77 ఏళ్ల అని, వయస్సు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వ్యాఖ్యానించారు. ఇక ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడమే మంచిదన్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ.


అమిత్ షా కామెంట్స్‌పై తనదైనశైలిలో స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. వయసు రీత్యా సీఎం నవీన్ రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని షా చెబుతున్నారని అన్నారు. ఒక వేళ బీజేపీ అధికారం లోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఇస్తున్న సూచన ఇదేనా అంటూ ప్రశ్నించారు. కమలం అధికారంలోకి రాకపోతే హ్యాపీగా ఫీలయ్యే వ్యక్తి షా అని చెప్పుకొచ్చారు. అప్పుడు మోదీ కాకుండా ఆయనే ప్రతిపక్ష సీటులో కూర్చునేలా ఉన్నారని పోస్టు చేశారు.

సీఎం నవీన్ వయస్సు 77 ఏళ్లు కాగా, ఆ పార్టీలో వయస్సు నిబంధన అనేది లేదు. బీజేపీలో మాత్రం 75 ఏళ్ల వయస్సు దాటితే ఆయా నేతలను పక్కన పెట్టాలనే నిబంధన ఉంది. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ దీన్ని తీసుకొచ్చారు. ఆ లెక్కన నరేంద్రమోదీ వయస్సు 74 ఏళ్లు. ఆ లెక్కన చూస్తే మరో ఏడాది మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉంటారు. ఆ తర్వాత ఆయన తప్పుకోవడం ఖాయమన్నమాట.

ALSO READ: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

ఆ నిబంధన కారణంగా బీజేపీలోని చాలామంది సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు అదేబాటలో పయనిస్తారా? అనేది ఆ పార్టీకి పెద్ద ప్రశ్న. వారం కిందట ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయాన్ని లేవనెత్తిన విషయం తెల్సిందే.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×