E-Paper
Advertisement

Prajwal Revanna: ‘నోనో.. ఫస్ట్ అరెస్ట్.. ఆ తర్వాతే ఎంక్వైరీ’

Prajwal Revanna: ‘నోనో.. ఫస్ట్ అరెస్ట్.. ఆ తర్వాతే ఎంక్వైరీ’

Court rejects Prajwal Revanna anticipatory bail Plea: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రజ్వల్ రేవణ్ణ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అయితే, మ్యూనిచ్ నుంచి ప్రజ్వల్ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. మే 31 రేవణ్ణ బెంగళూరులో అడుగుపెట్టే అవకాశముంది. ఈ క్రమంలో అందరి దృష్టి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే ఉంది. ఎయిర్ పోర్టులో రేవణ్ణ దిగిన వెంటనే అతడిని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశంలేకపోలేదంటూ ప్రచారం జరుగుతుంది.

మహిళలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రజ్వల్ రేవణ్ణను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నం చేశారు. ఇటు మాజీ ప్రధాని దేవెగౌడ కూడా హెచ్చరికలు చేశారు. వెంటనే వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ రేవణ్ణను హెచ్చరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని, మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని, ఈ కేసులో దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానంటూ రేవణ్ణ ఓ వీడియోను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read: మరోసారి చర్చనీయమైన మోదీ వ్యాఖ్యలు.. ఒడిశా సీఎం ఆరోగ్యంపై మాట్లాడుతూ..

అదేవిధంగా తనపై నమోదైన కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ కూడా ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం కోర్టులో విచారణ జరుగగా, సిట్ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్ విషయమై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్.డి. రేవణ్ణ మధ్యంతర బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం విన్నది. అనంతరం భవానీకి ముందస్తు బెయిల్ పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×