E-Paper
Advertisement

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం

Su-30 MKI Jets’ Engines: సుఖోయ్ ఇంజిన్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం.. ఒప్పందంపై సంతకం
Advertisement

Su-30 MKI Jets’ Engines: దేశ రక్షణ శక్తిని బలపరిచేందుకు నిరంతరం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సుఖోయ్ -30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్ పీ ఏరో ఇంజిన్ ల కొనుగోలుకు రూ. 26 వేల కోట్లతో తాజాగా ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాల్గొన్నారు.

Also Read: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ.. ఆరుగురు దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

అయితే, ఈ ఏరో ఇంజిన్లను HAL యొక్క కోరాపుట్ డివిజన్ లో తయారు చేస్తున్నారు. సుఖోయ్ -30 విమానాల ఫ్లీట్ కార్యాచరణ సామర్థాన్ని నిర్వహించడానికి ఇవి వైమానికి దళ అవసరాలను తీర్చగలవని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం.. HAL సంవత్సరానికి 30 ఏరో ఇంజిన్లను సరఫరా చేస్తున్నది. ఈ విధంగా మొత్తం 240 ఇంజిన్ల సరఫరా వచ్చే 8 ఏళ్లలో పూర్తవ్వనున్నది. తద్వారా దేశ రక్షణ బలానికి ఈ ఒప్పందం కొత్త పుంతలు తొక్కుతుందడనంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

Also Read: అమెరికాలో రాహుల్‌గాంధీ.. కీలక వ్యాఖ్యలు, రాజకీయాల్లో గౌరవం లేదంటూ..

Advertisement

ఇదిలా ఉంటే.. ఈ ఇంజిన్లు 54 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ ను కలిగి ఉంటాయి. వీటిని.. హెచ్ఏఎల్ లోని కోరాపుట్ డివిజన్ లో తయారు చేయనున్నారు. SU-30 మార్క్ 1 అనేది భారత వైమానికి దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన, వ్యూహాత్మకమైనటువంటి విమానాలల్లో ఇది ఒకటి. HAL ద్వారా ఈ ఏరో-ఇంజిన్ల సరఫరా భారత వైమానిక దళం యొక్క నిర్వహణ అవసరాలను తీర్చనున్నది. దీంతో, వారు తమ నిరంతర కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. అదేవిధంగా దేశ రక్షణ సంసిద్ధతను పటిష్టం చేసే వీలు ఉండనున్నది.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×