Fake Posts: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో వరదలు వచ్చినట్లు చూపించిన 63 సోషల్ మీడియా హ్యాండిల్స్పై కేసు నమోదైంది. విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని సూచిస్తూ తప్పుదోవ పట్టించే మరియు తప్పుడు పోస్టులు, వీడియోలను పంచుకున్నందుకు 63 సోషల్ మీడియా హ్యాండిల్స్పై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఫిర్యాదు చేసింది. దీంతో 63 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సెప్టెంబర్ 4వ తేదీన ఢిల్లీలో భారీ వర్షం కారణంగా టెర్మినల్-3 అరైవల్ ప్రాంతంలో కాసేపు నీరు చేరింది. అయితే కేవలం 20 నిమిషాల్లోనే ఆ నీటిని క్లియర్ ఎయిర్పోర్ట్ సిబ్బంది కల్లియర్ చేసారు. దీంతో విమానాశ్రయ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని DAIL క్లారిటీ ఇచ్చింది. కానీ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పాత దుబాయ్ ఎయిర్పోర్ట్ వరద వీడియోలను, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించిన తప్పుడు చిత్రాలను ఢిల్లీ ఎయిర్పోర్ట్ వీడియోలుగా చూపిస్తూ తప్పుదోవ పట్టించారని DIAL ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also read: ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్
దీంతో ప్రజా ప్రయోజనార్థం పనిచేసే ప్రభుత్వ సేవలకు చెడ్డపేరు తీసుకురావడానికి, ప్రయాణికులలో ఆందోళన కలిగించడానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని విమానాశ్రయ అధికారుల పేర్కోన్నారు. దీంతో అందుకే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ DIAL క్లారిటీ ఇచ్చింది.
Also read: తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!