E-Paper
Advertisement

ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్‌పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!

ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్‌పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!
Advertisement

CJP Protests: నీట్ (NEET), CBSE పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేడు జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

నిఘా నీడలో ఢిల్లీ.. రంగంలోకి బలగాలు

Advertisement

ఈ ఆందోళనలకు పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు అప్రమత్తమయ్యాయి. జంతర్‌మంతర్ పరిసరాల్లో బారికేడ్లు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, సరిహద్దుల వద్ద వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించారు.

అరెస్టుకు సిద్ధమైన వ్యవస్థాపకుడు

Advertisement

ఈ ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. కాగా, అమెరికా నుంచి మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే, పోలీసులు అరెస్ట్ చేసినా రాజ్యాంగబద్ధంగా తన నిరసనను కొనసాగిస్తానని, శాంతియుత పోరాటంలో ప్రజలంతా పాల్గొనాలని అభిజిత్ పిలుపునిచ్చారు.

హైకోర్టు కీలక నిర్ణయం

మరోవైపు, ఈ ఆందోళనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.

Also Read: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×