E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు
Advertisement

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫోటోలు, ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో రోజు రోజుకి పెరుగుతున్న వాయి కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చేపట్టాలని ఆదివారం నాడు పలువురు ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్ కౌంటర్ లో ప్రమాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు మద్ధతుగా ప్రకార్డులు, ఫోటోలు దర్శనమిచ్చాయి.

Advertisement

బిర్సా ముండా నుండి మాద్వి హిడ్మా వరకు మన అడవులు, పర్యావరణంపై పోరాటం సాగింది. మన బిడ్డలను మనమో చంపుకోవడం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్, జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగుతోంది, మాద్వీ హిద్మా అమర్ రహే” (మాద్వీ హిద్మా వర్థిల్లాలి) అంటూ పోస్టర్‌ని ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకొని నిరసన కారులను చెదరగొట్టారు. దీంతో పోలీసు సిబ్బందిపై చిల్లీ స్ప్రేతో దాడి చేశారు.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు కారణమైన హిడ్మా.. నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. 2010లో దంతేవాడలో జరిగిన దాడిలో 76 మంది CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో జిరామ్ ఘాటిలో జరిగిన ఆకస్మిక దాడిలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సహా 27 మంది మరణించారు. 2021లో సుక్మా-బీజాపూర్ ఆకస్మిక దాడిలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. దీనిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

Advertisement

Also Read: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. కాగా మావోయిస్టు నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇండియా గేట్ వద్ద అలాంటి నినాదాలు చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×