E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫోటోలు, ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో రోజు రోజుకి పెరుగుతున్న వాయి కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చేపట్టాలని ఆదివారం నాడు పలువురు ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్ కౌంటర్ లో ప్రమాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు మద్ధతుగా ప్రకార్డులు, ఫోటోలు దర్శనమిచ్చాయి.

బిర్సా ముండా నుండి మాద్వి హిడ్మా వరకు మన అడవులు, పర్యావరణంపై పోరాటం సాగింది. మన బిడ్డలను మనమో చంపుకోవడం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్, జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగుతోంది, మాద్వీ హిద్మా అమర్ రహే” (మాద్వీ హిద్మా వర్థిల్లాలి) అంటూ పోస్టర్‌ని ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకొని నిరసన కారులను చెదరగొట్టారు. దీంతో పోలీసు సిబ్బందిపై చిల్లీ స్ప్రేతో దాడి చేశారు.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు కారణమైన హిడ్మా.. నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. 2010లో దంతేవాడలో జరిగిన దాడిలో 76 మంది CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో జిరామ్ ఘాటిలో జరిగిన ఆకస్మిక దాడిలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సహా 27 మంది మరణించారు. 2021లో సుక్మా-బీజాపూర్ ఆకస్మిక దాడిలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. దీనిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

Also Read: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. కాగా మావోయిస్టు నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇండియా గేట్ వద్ద అలాంటి నినాదాలు చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×