E-Paper
Advertisement

Updates on Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్‌ జైలు నుంచి ఆదేశాలు ఎలా ఇచ్చారు..? ఈడీ సీరియస్..!

Updates on Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్‌ జైలు నుంచి ఆదేశాలు ఎలా ఇచ్చారు..? ఈడీ సీరియస్..!
Advertisement
Arvind Kejriwal
Arvind Kejriwal

ED Serious on Arvind Kejriwal Order: జైలు నుంచే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారన్న వ్యవహారంపై వివాదం రేగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలంటూ మంత్రి అతీశీ ఆదివారం మీడియా మీట్ నిర్వహించి ఓ పేపర్ ను చూపించారు.

ఈ విషయంపై ఈడీ స్పందించింది. కస్టడీలో ఉండగా కేజ్రీవాల్ కు ఎలాంటి పేపర్స్ తాము ఇవ్వలేదని ఈడీ అధికారులు వెల్లడించారు. అలాంటప్పుడు ఆయన ఆదేశాలు ఎలా ఇచ్చారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతోంది. ఢిల్లీ మంత్రి అతిశీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది.  జైల్లో కేజ్రీవాల్‌ సీసీ దృశ్యాలను పరిశీలిస్తారని అంటున్నారు.

Advertisement

మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది. లక్షా 50 వేల మందితో సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 31న ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 27, 28 తేదీల్లో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణను ఆప్ నేతలు ప్రకటించనున్నారు.

Also Read: కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ.. నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు?

Advertisement

కేజ్రీవాల్ అరెస్ట్ పై శివసేన ఉద్ధవ్ వర్గం స్పందించింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎంను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఆప్ నిర్వహించే సభలో పాల్గొంటామని తెలిపారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×