Big Stories

CM Kejriwal’s phone: కేజ్రీవాల్ ఫోన్ చుట్టూ దర్యాప్తు.. అందులో పోల్ స్ట్రాటజీ ఉందా?

arvind kejriwal news today

- Advertisement -

Arvind kejriwal news today(Telugu flash news): మద్యం కుంభకోణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని వచ్చేనెల ఒకటి వరకు పొడించింది న్యాయస్థానం. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఈడీ, కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీ మంత్రి ఆతిశీ. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవడానికి ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ చేసిన వాదనలను ఆమె గుర్తు చేశారు. ఈడీ దర్యాప్తు జరుగుతున్న మద్యం విధానం రెండేళ్ల కిందట కొన్నిరోజులపాటు అమల్లో ఉందని తెలిపింది. ఆ సమయంలో సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ ప్రస్తుతం లేదన్నారు. ఇప్పుడు ఆయన వినియోగిస్తున్న ఫోన్‌ను కొద్దిరోజుల కిందట కొనుగోలు చేశారని వెల్లడించింది. కానీ, కొత్త ఫోన్ పాస్‌వర్డులను ఈడీ ఎందుకు అడుగుతోందని మంత్రి ఆతిశీ ప్రశ్నించారు.

ఈడీ వ్యవహారశైలి చూస్తుంటే.. బీజేపీకి రాజకీయ ఆయుధంగా పని చేస్తోందని దుయ్యబట్టారామె. ముఖ్యంగా ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ఇండియా కూటమి నేతలతో జరిపిన చర్చలు, సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈనెల 21న ఈడీ జరిపిన సోదాల్లో నాలుగు డిజిటల్ గాడ్జెట్స్‌ను సొంతం చేసుకుంది. వాటి పాస్‌వర్డ్ ఆయన ఇవ్వలేదని తెలిపింది ఈడీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News