E-Paper
Advertisement

Delhi Rains: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

Delhi Rains: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

Heavy Rain in Delhi today news(Telugu flash news): ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఏకంగా గంటలోనే 13 సెంమీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలో 11సెంమీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రెండు మీటర్ల వరకు వరద నిండుకుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది.

ఇదిలా ఉండగా, రావూస్ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతిని మరచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది, ఈ వర్షానికి ఓ మహిళతోపాటు ఆమె కుమార్తె ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయారు. దీంతో ఇద్దరే మరణించినట్లు సమాచారం. ఢిల్లీతోపాటు నోయిడా లోనూ భారీ వర్షం కురుస్తోందని అధికారులు తెలిపారు.

Also Read: సర్వీస్ ప్రొవైడర్లపై రాన్సమ్‌వేర్ దాడి.. 300 బ్యాంకులపై ఎఫెక్ట్

ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే, వసంత్ కుంజ్ లో భారీ వర్షాలకు గోడ కూలడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 10 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలకు దారి మళ్లించారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×